దేశంలో రాను రాను మానవ సంబంధాలు పూర్తిగా అంతరించి పోతున్నాయి.  అడవిలో జంతువుల మాదిరి సమాజంలో క్రూరమృగాలు తిరుగుతున్నాయి.  కొన్ని సంఘటనలు చూస్తుంటే భయంతో బిక్కచచ్చిపోయే పరిస్థితి వస్తుంది.  తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. కెఆర్‌కె కాలనీలో ఓ పసికందును దుండగులు దారుణంగా హత్య చేశారు.


పసికందు తలను, మొండెం ను వేరు చేసి, వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. కాలనీలోని ఓ రోడ్డుపై పసికందు తల దొరికింది.  ఆ పసికందు ఎవరు..ఎక్కడ నుంచి తెచ్చారు..ఎందుకు ఇంత దారుణానికి వడిగట్టారు అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  చిన్నారి మొండెం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


అయితే చిన్నారిని వదిలేస్తే కుక్కలు ఏమైనా ఆ చిన్నారిని చంపాయా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కుక్కలు చంపితే తలపై గాయాలు ఉంటాయి... మొండెం ఎలా వేరు అవుతోందని కూడ అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని ఎవరు హత్య చేశారనే  కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: