తెలుగుదేశం పార్టీ కంచుకోట అనంతపురం జిల్లాలో ఆ పార్టీ కంచుకోటలు కూలిపోతున్నాయి. తొలి రౌండ్స్ ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం క్రియేట్ చేసింది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకంగా 10 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఉన్నారు. పయ్యావుల కేశవ్ లాంటి వాళ్లు కూడా వెనకపడ్డారు. రెండు ఎంపీ స్థానాల్లోనూ వైసీపీ ముందంజంలో ఉంది. గుంతకల్లు, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. కదిరితో పాటు చివరకు రాప్తాడులో పరిటాల శ్రీరామ్ కూడా వెనుకంజలో ఉన్నారు.