ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విపక్ష వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే తొలి రెండు రౌండ్ల ఫలితాలు పూర్తయ్యేసరికి వైసీపీ మ్యాజిక్ ఫిగర్ 88 దాటేసి... 120 సీట్లు గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. దీంతో ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలకు సిద్ధమవుతున్నాయి. అటు హైదరాబాద్లోని లోటస్పాండ్లో కూడా బాణసంచాల పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ శ్రేణులు ఆనందానికి అవధులు లేవు. ఇక ఏపీ ఓటరు చంద్రబాబు ఎన్ని మాయమాటలు చెప్పినా బై బై బాబు...బై బై చంద్రబాబు అన్న నినాదాన్ని ఫలితాల్లో నిజం చేసేశారు.