జ‌న‌సేన‌కు ఎన్నిక‌ల ఫ‌లితాలు చేదు అనుభ‌వాన్నే మిగ‌ల్చ‌నున్నాయి. ప‌వ‌న్ పోటీ చేసిన భీమ‌వ‌రంలో జ‌న‌సేన అభ్య‌ర్థి గ్రంధి శ్రీనివాస్ దూసుకుపోతున్నారు. ఇక గాజువాక‌లో కూడా ప‌వ‌న్‌కు వైసీపీ అభ్య‌ర్థి తిప్ప‌ల నాగిరెడ్డికి మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డుస్తోంది. ఇక ప‌వ‌న్ అన్న నాగబాబు పోటీ చేసిన న‌ర‌సాపురంలో ప‌రిస్థితి దారుణంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ స్థానంలో వైసీపీ ముందజలో ఉంది. టీడీపీ, జనసేన అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. 


ఇక్క‌డ నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాగబాబు.. టీడీపీ అభ్యర్థి వెంకట శివరామ రాజు ఇద్దరూ వెనుకంజలో ఉన్నారు. ఇప్ప‌టికే వైసీపీ అభ్య‌ర్థి ర‌ఘురామ‌కృష్ణంరాజు 10 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇక్క‌డ టీడీపీ రెండో స్థానంలో ఉండ‌గా... జ‌న‌సేన నాగ‌బాబు మూడో స్థానంలో ఉన్నారు. కాగా.. ఈ పార్లమెంట్ స్థానం కింద ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: