దేశ వ్యాప్తంగా నేడు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎన్డీఏ అత్యధిక 350 పై చిలుకు సీట్లు సాధించి విజయ దుంధుభి మోగిస్తుంది. ఇక ఏపిలో అన్ని పార్టీలను పక్కన బెట్టి వైసీపీ 175 స్థానాలకు 150 స్థానాల్లో మెజార్టీతో ముందుకు సాగుతుంది. 

ప్రపంచంలో ఎక్కడైనా  విజేతల గురించే అందరూ మాట్లాడుకుంటారు, వారికి శుభాకాంక్షలు చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  ఈ నేపథ్యంలో ఏపీలో అమోఘమైన రీతిలో విజయం సాధించిన జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ విషెస్ చెప్పారు.


"ప్రియమైన జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను. మీకు ఇవే నా శుభాకాంక్షలు. మీ ఐదేళ్ల పదవీకాలంలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అంటూ ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: