లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఘనవిజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖాయం అంటూ కొన్నిరోజుల నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. మోదీతో పాటు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి కిషన్రెడ్డికి ఫోన్ రావడంతో హస్తిన వెళ్లారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారం పూర్తిచేసిన కిషన్ రెడ్డి అత్యంత విధేయతతో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి నిష్క్రమించారు. మొదటిసారి ఎంపీ గా గెలిచిన కిషన్ రెడ్డి కి మంత్రి పదవి రావడంతో రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కిషన్రెడ్డికి ఏ శాఖ అప్పగిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.