భారత వాయుసేనకు చెందిన విమానం జోర్ హట్ నుండి బయలుదేరి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు లేకుండాపోయింది.  ఈ విమానం లో 8 మంది క్రూ మెంబర్స్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు ఏఎన్32 ఎయిర్ క్రాఫ్ట్ జోర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మేచుకాకు బయల్దేరింది. 


చివరిసారిగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఏటీసీతో సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు టేకాఫ్ అయింది.   జూలైలో ఈ విమానం అదృశ్యమైనా కూడ దాని ఆచూకీ కోసం అదే ఏడాది సెప్టెంబర్ వరకు వెతికారు.


 ఒంటి గంట సమయంలో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను కోల్పోయింది. విమానం ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: