జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ఇప్పటికే రావెల కిషోర్ బాబు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పార్టీని వీడి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి.
అయితే, జనసేన మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. నాదెండ్ల మనోహర్ పార్టీలోనే ఉన్నాడని, ప్రస్తుతం విదేశాల్లో ఉండటం వలన రివ్యూ సమావేశానికి రాలేకపోయారని, జనసేన ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ఒక్కడు ఉన్నా పార్టీని సడిపించుకోగల సత్తా ఉంది. ఆయనకు అభిమానులు అండగా ఉన్నారు. డబ్బు లేకున్నా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకొని వాళ్ళతో పాటు ఉంటూ ముందుకు సాగాలని పవన్ అనుకుంటున్నాడు. ఒక్కడిగా ముందుకు సాగేందుకు రెడీ అవుతున్నాడు. ఒకడిగా ప్రయాణం మొదలు పెడితే వచ్చేవాళ్ళు వస్తారు.
జనసేన పార్టీ కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని నిర్ణయించుకుంది. పార్టీని బలోపేతం చేయడం దగ్గరి నుంచి పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి కార్యకర్తలను రిక్రూట్ చేసుకునే విషయాలపై ఇప్పుడు శ్రద్ధ చూపించబోతున్నది.