సోషల్ మీడియాలో హల్చల్ చేసే టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. ఈ రోజు మంగళగిరి డీజీపీ ఆఫీస్ కి వచ్చిన ఎస్పీ సరితా గారిని కలిశారు. ఆమె పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పిర్యాదు చేశారు..
యామినీ గారి పిర్యాదులో ఇంకా ఏమంటారంటే....
1, తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.
2,గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు.
3, తనని,తన కుటంబ సభ్యులను బెదిరిస్తున్నారు.
4, ఈ విషయంపై సీఎం ని కలిసి వివరిస్తా. సీఎం వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలి.