ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ తొలి సమావేశం సోమవారం అమరావతిలో జరిగింది. జగన్ సీఎం అయ్యాక మంత్రి వర్గ కూర్పు చేశాక జరిగిన ఈ తొలి సమావేశం సుదీర్ఘంగా ఆరు గంటల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 25 మంది మంత్రులు పాల్గొన్నారు. కేబినెట్లో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయాల సంగతి పక్కన పెడితే టోటల్ కేబినెట్ మొత్తానికి జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
మంత్రులు తమ శాఖల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. అవినీతి అనే పదాన్ని తాను సహించనని.. తేడా వస్తే ఖేల్ ఖతం అని కూడా గట్టిగా హెచ్చరించారట. ఈ విషయాన్ని కేబినెట్ మంత్రి పేర్ని నాని బయటకు వచ్చాక మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ లీక్ చేయడంతో లోపల సీఎం హెచ్చరించిన సంగతి బయటకు వచ్చింది. జగన్ కేబినెట్ టీంకు సుతిమెత్తగా చెపుతూనే తనదైన స్టైల్లో హెచ్చరికలు జారీ చేశారట. మంత్రులు అవినీతి చేసినా, శాఖల్లో పొరపాట్లు జరిగినా వారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించనని కూడా ఖరాఖండీగా చెప్పేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అవినీతికి పాల్పడిన మంత్రుల విషయంలో అప్పటికప్పుడే విచారణ జరిపి.. వాస్తవం అని తేలితే వెంటనే సస్పెన్షన్ ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. మంత్రులకు తాము ఏ శాఖలు అయితే కేటాయించామో ఆ శాఖలకు సంబంధించి ప్రతి అంశాన్ని వెబ్సైట్లో పొందుపరచాలని.. జ్యుడిషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడంతో పాటు అవినీతిని బయటపెట్టిన మంత్రులతో పాటు అధికారులకు కూడా సన్మానం చేయాలన్న కొత్త కాన్సెప్ట్ను జగన్ చెప్పినట్టు సమాచారం.
ఏదేమైనా సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కేబినెట్ కూర్పు వరకు ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందుగా ఉన్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు తొలి కేబినెట్ సమావేశంలోనూ తనదైన స్టైల్ను ఫాలో అవుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఏక్నిరంజన్లా ఉన్న జగన్పై ఇప్పుడు ప్రత్యర్థులు కూడా గురిపెడుతుంటారు. జగన్ తన నిర్ణయాల వరకు బాగానే తీసుకున్నా టీంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు తప్పులు చేయడం కామన్. ఈ క్రమంలోనే వాళ్లకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే అవినీతి చేస్తే చిక్కులు తప్పవని మంత్రులకు జగన్ క్లారిటీగా చెప్పేశారు. ఇక ఇప్పుడు మంత్రులు పద్ధతిగా పని చేస్తే ఓకే.. లేకపోతే వాళ్ల మొడ మీద వేటు కత్తి వేలాడుతూనే ఉంటుంది.