సరిగ్గా ఎన్నికలకు నెలరోజుల ముందు నుండి ఏ టీవీ చానెల్ చూసినా తెలుగుదేశం పార్టీ యాడ్లు ఎన్నో వచ్చేవి. ఆ సీన్లకు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం టీవీలో వచ్చిన యాడ్స్ మాత్రం భలే హిట్టయ్యయి.
కొన్ని యాడ్లపై విమర్శలు వచ్చినా తీసిన విధానంలో మాత్రం తన ప్రతిభనంతా వినియోగించాడు బోయపాటి. వైసీపీ విషయానికి వస్తే దర్శకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అవి ఏవీ హిట్టవ్వలేదు. బోయపాటి తీసిన ప్రకటనలు టీడీపీకి ఎంతో కొంత మేలు చేస్తాయని అందరూ భావించారు
కానీ ఎన్నికల్లో మాత్రం వైసీపీనే గెలిచింది. ప్రజలు చేసిన పరిపాలనను చూస్తారు ఆ పరిపాలననే నమ్ముతారు అంతే తప్ప టీవీలో వచ్చే ప్రకటనలు చూసి ఓట్లు వేయరు. ఈ విషయం చంద్రబాబు గ్రహించి ఉంటే ప్రకటనల కోసం అంత ఖర్చు పెట్టేవాడు కాదేమో