దేశంలో బీజేపీ హవా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. గతంతో పోలిస్తే..
ఇప్పుడు బలం మరింత పెరిగింది. 287 స్థానాల నుంచి ఏకంగా 303 స్థానాలు
గెలుచుకోగలిగింది. ఇది పార్టీకి మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.
ఇప్పటికే దేశంలోనూ, ప్రపంచంలోనూ అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ.
దాదాపు
11 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. గతేడాది మెంబెర్ షిప్ ద్వారా
దాదాపుగా 10 లక్ష మంది బీజేపీ లో చేరారు. ఇప్పుడు దాని కంటే 20శాతం
అధికంగా మెంబర్ షిప్ ను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది పార్టీ. అనే
ఈసారి 20 కోట్ల మంది కార్యకర్తలను రిక్రూట్ చేసుకోబోతున్నారన్నమాట.
ప్రస్తుతం
ఇది బీజేపీ ముందున్న పెద్ద టార్గెట్ అనుకోవచ్చు. కానీ, ఇది సాధ్యం కానిది
కాదు. ఎందుకంటే ఈ స్థాయిలో కార్యకర్తలను ఏర్పాటు చేసుకోగలితే.. బీజేపీ
ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.
కాంగ్రెస్
పార్టీలో జాయిన్ అయ్యేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతటా
మోడీ.. బీజేపీ హవా నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద విషయం కాదని
అంటున్నారు బీజేపీ నాయకులు.