టీడీపీ గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది దీంతో ఆ పార్టీని విమర్శించేవారు ఎక్కువైపోతారు. సొంతంగా ఆ పార్టీలో ఉన్న కొంతమంది బయటకు వచ్చి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అందులో ఒకరు జెసి దివాకర్ రెడ్డి. ఇప్పుడు టిడిపి బోధనలు చేయడం మొదలుపెట్టారు.
తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఎన్టీఆర్ కు అప్పగిస్తే ఏమౌతుంది.. అలాగే రాజకీయాల్లో పవన్ గురించి.. రోజా గురించి కూడా జెసి మాట్లాడారు. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే కొన్నేళ్ళకు మంచి నాయకుడు అవ్వోచ్చేమో కానీ ఇప్పుడే తనకు అంత రాజకీయ అనుభవం లేదని జేసీ అన్నారు. అంతేకాకుండా “పవన్ కల్యాణ్ అంతటివాడికి కూడా రాజకీయాలు సరిపడవని చెప్పాను.
పవన్ కు ఎంత పేరుంది? మిమ్మల్ని చూడ్డానికి జనం వస్తారే తప్ప వారంతా మీ వెంట నడిచేవాళ్లు కాదని చెప్పాను. చిరంజీవి, రోజా ఇలా ఎంతోమంది సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. తెరపై నటించే ఆ నటులను చూడ్డానికి జనం వస్తారే తప్ప వాళ్లను రాజకీయంగా ఆమోదించడం చాలా కష్టం అని జెసి పేర్కొన్నారు.
జెసి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. జెసి ఇలాంటి మాటలు చేయడం ఏంటి అని అభిమానులు మండిపడుతున్నారు. జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్, రోజాలు ఎలా స్పందిస్తారో చూడాలి.