కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం వేళ తెలుగు దేశం పార్టీ భిన్నంగా స్పందించింది. నీళ్లు లేని ప్రాజెక్టు కి కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనీ తెలుగు దేశం నేత బూరగడ్డ వేదవ్యాస్ కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిషత్ లో మ్యూజియం లాగా చూడటానికి తప్ప దేనికి పనికి రాదని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

 

ఓ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ప్రారంభం వేళ ఇలా నెగిటివ్ గా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇదే సమయంలో ఆయన జగన్ పైనా విమర్శలు గప్పిస్తున్నారు. కేసీఆర్ ట్రాప్ లో జగన్ ఉన్నారు...అందుకే పిలవగానే వెళ్తున్నా రని విమర్శించారు.

 

కాళేశ్వరం పై ఏపీ సీఎం జగన్ గతం లో చేసిన వ్యాఖ్యల వీడియోను మీడియా కి వేదవ్యాస్ చూపారు.కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆంధ్ర తెలంగాణ ఇండియా పాకిస్తాన్ లా అవుతాయి అన్న జగన్ ఎలా వెళ్లారు ఈ రోజు అని ప్రశ్నించారు.

 

జగన్ తెలంగాణ సర్కారు తో జగన్ ఏమి లాలూచీ పడ్డారో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. నిన్న కాకినాడ లో తెదేపా నేతల సమావేశం కేవలం పార్టీ బలోపేతం కోసమే అంటూ సమర్థించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: