చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా, జంపింగ్ జలానీలు మొదలయ్యాయి. కాగా, పార్టీ వీడిన ఎంపీలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించిన నేతలు, ఇప్పుడు పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ స్పందించారు.

 

టీడీపీ పెట్టిన భిక్షతో ప్రభుత్వాలు నడిచిన చరిత్ర కూడా ఉందని పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘2004లో అధికారం కోల్పోయాం.. పదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులు నాకంటే మీకే బాగా తెలుసు... కొందరు నాయకులను హత్య చేయడం.. కొందరిని బెదిరించి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంది. పదేళ్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడ్డాం..

 

2014 లో మళ్ళీ టీడీపీ అవసరం ఉందని గ్రహించి ప్రజలు మన పార్టీకి అధికారం ఇచ్చారు.. మన నాయకుడు రాష్ట్రంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం. చంద్రబాబు నాయకత్వంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. సంక్షేమం, అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా అమలు చేసి తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేశారు.

 

అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాం. మన పార్టీ పెట్టిన భిక్షతో ప్రభుత్వాలు నడిచిన చరిత్ర కూడా మీకు తెలుసు. ఒక నాయకుడు వెళ్తే వంద మందిని తయారు చేసుకునే శక్తి మనకు ఉంది. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది అన్నారు... కాని మీరే చూశారు మొన్న ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు వెళ్తే ఎంత మంది పసుపు జెండా పట్టుకుని నిలబడ్డారో.. అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: