వైసీపీ పార్టీలో కీలక మహిళా నేత రోజా. ఇప్పటికే రోజాకు జగన్ ఒక కీలక పదవి ఇచ్చారు. అయితే ఇది జస్ట్ కొసరు మాత్రమే, అసలు పదవి ఇంకోటి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును.. నగరి ఎమ్మెల్యే రోజా కోసం జగన్ ప్రత్యేకంగా ఓ కొత్త పదవిని సృష్టించే పనిలో ఉన్నారట. తను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు అమలు బాధ్యతను రోజాకు అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేసి దానికి రోజాను అధ్యక్షురాలిగా నియమించాలని అనుకుంటున్నారట.


ఈ సంస్థ ఇతర శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ నవరత్నాల హామీల్ని దగ్గరుండి అమలు చేస్తుందన్నమాట. నిజంగా రోజాకు ఇది కీలకమైన బాధ్యత, పదవి. దాదాపు అన్ని శాఖల్ని సమన్వయపరిచే పదవి అంటే మామూలు విషయం కాదు. దీనికోసం సీఆర్డీఏ తరహాలో ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని జగన్ భావిస్తున్నారు. దీనిపై ఏ మంత్రి ఆజమాయిషీ ఉండదు. పూర్తిగా రోజాదే బాధ్యత.


ఆమె జగన్ కు రిపోర్ట్ చేస్తారన్నమాట. నవరత్నాల అమలుతో పాటు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగకుండా చూసే బాధ్యత కూడా రోజాదే. అయితే ఇక్కడే కొంతమంది మరో వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. రోజాకు ఈ బాధ్యత అప్పగిస్తే, రెండున్నరేళ్ల తర్వాత జరిగే రెండో విడత కేబినెట్ విస్తరణలో ఆమెకు ఇక మంత్రిపదవి ఇవ్వరని అంటున్నారు. అయితే మంత్రి పదవితో సమానంగా ఈ నూతన పదవిని తీర్చిదిద్దాలని జగన్ భావిస్తున్నారు. సో.. రోజా మంత్రిపదవి కల నెరవేరబోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: