కత్తి మహేష్ కు వివాదాలు కొత్తేమి కాదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ వంటి కత్తి మహేష్, ఇప్పడు టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అపర  చాణక్యుడో ...చేతగాని చావటో తెలుగుదేశం పార్టీ లోని కమ్మోళ్ళు డిసైడ్ చేస్తే, మా ఎనాలసిస్ మేము చేసుకుంటామని కత్తి మహేష్ ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వైకాపా అభిమానులు కత్తి మహేష్ ఫేస్ బుక్ లో చేసిన పోస్టింగ్ ను తెగ షేర్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు  కత్తి మహేష్ , వైకాపా సానుభూతి పరుడన్నది జగమెరిగిన సత్యమే.


అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెంది, వైకాపా అధికారం లోకి రావడం కత్తి మహేష్ కూడా టీడీపీ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు పదను పెట్టాడు. ఇటీవల టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరిన సందర్బంగా కత్తి మహేష్ తన ఫేస్ బుక్ పేజీ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ లు గంపగుత్త గా ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన కత్తి మహేష్, చంద్రబాబు వాళ్లనే బీజేపీ కి అమ్ముకున్నారా ? అంటూ నిలదీశారు.


 టీడీపీ ఎంపీలు  వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడాని, జైళ్లకు వెళ్లకుండా తప్పించుకోవడాని బీజేపీ లో చేరారా? అంటూ అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన, రాజ్యసభ లో తమ  బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ వీళ్ళను ఆకర్షించిందా ? అన్న కత్తి మహేష్, ఈ విషయం తెలిసి కూడా చెప్పకపోతే, చంద్రబాబు తో పాటు మీరు విదేశాలకు వెళ్లాల్సి వస్తుందని అపహాస్యం చేశాడు. కత్తి మహేష్ రాజకీయ నాయకుడు ఏమి కాదు. సెలబ్రెటీ అంతకంటే కాదు. సినీ విశ్లేషకునిగా చెప్పుకునే కత్తి మహేష్ బిగ్ బాస్ -1 షో లో పాల్గొన్న తరువాత , తెలుగు ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు పరిచయం అయ్యాడు.


అనంతరం టీవీ చర్చల్లో పాల్గొంటూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఇక పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ అభిమానులకు , కత్తి మహేష్ మధ్య జరిగిన వివాదం అంత , ఇంత కాదు. పవన్ కళ్యాణ్ అభిమానుల తో వివాదం కొనసాగుతుండగానే, శ్రీరాముడి పై వివాదాస్పద వ్యాఖ్యలతో హైదరాబాద్ నగర బహిష్కరణ గురయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు పై తీవ్ర స్థాయి వివాదాస్పద వ్యాఖలతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: