కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత ఎవరెవరికి మహేశ్? 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అట్టహాసంగా జరిగింది. అయితే స్వతాహాగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు భజన చేసే కొందరు సినీ ప్రముఖులు ఇప్పడు ఈ ప్రాజెక్టు కారణంగా అత్యుత్సాహం చూపించి హరీశ్ రావు అభిమానుల ఆగ్రహానికి గురవుతూ విమర్శలనెదుర్కొంటున్నారు. ఇప్పటికే నాగార్జున, రవితేజ వీరి కోపానికి బలి కాగా ఇప్పుడు కొత్తగా మహేశ్ ఈ జాబితాలో చేరాడు. మహేశ్, కేటీఆర్ సన్నిహితంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. 

కొంత ఆలస్యంగానైనా మేల్కొన్న మహేశ్ ఎట్టకేలకు ట్విట్టర్ లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పొగిడాడు. అక్కడితో ఆగకుండా అదంతా కేటీఆర్ ఘనతగా రాసుకొచ్చాడు. “విప్లవాత్మక, ఆదర్శవంత, కళాత్మక తెలంగాణలో ప్రపంచంలోనే అతి పెద్దదైన నీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి eTelanganaCMO & TRKTRTRS కు అభినందనలు. ఇంజనీర్లకు హ్యాట్సాఫ్” అని రాసుకొచ్చాడు. ఇక్కడే మహేశ్ సదరు హరీశ్ రావు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ప్రాజెక్టు పూర్తవడం వెనుక హరీశ్ కష్టం గురించి తక్కువగా చెప్పలేం. కానీ ఈ భజన చేసే వారు హరీశ్ పేరు మరచిపోయి ప్రాజెక్టు మొత్తం క్రెడిట్ అంతా కేసీఆర్, కేటీఆర్ కే అప్పగించడం వారు తట్టుకోలేకపోతున్నారు.

 అయితే తెలంగాణలో ఉంటూ వారి ఆస్తులు కాపాడుకోవడం కోసం ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేసే సినీ ప్రముఖులకు లోటు లేదు. కానీ వాస్తవాలు గ్రహించి ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వారికి తలో కొంచెం ఇస్తే ఎవరికీ నష్టం లేదు. అసలే కేసీఆర్ కుటుంబానికి హరీశ్ కు దూరం పెరిగిందని వస్తున్న వార్తలకు సినీ హీరోలు చేసే ట్వీట్లు వారి మధ్యే కాకుండా టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తల మధ్య మరింత చిచ్చు రగిల్చే విధంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: