తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయాల భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. పార్టీ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. అన్ని జిల్లాల పార్టీ నాయకులు, మంత్రులతో ఫోన్లో మాట్లాడారు.

 

భూమిపూజ నిర్వహించే స్థలాలను వెంటనే పరిశీలించి సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని, నిర్మాణపనులు సత్వరమే పూర్తయ్యేట్టు చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలు తీసుకోవాలన్నారు. పార్టీ కార్యాలయాల నమూనాను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపికచేస్తారని తెలిపారు.

 

పార్టీ కార్యకర్తలందరి సమగ్ర సమాచారం ఉండటంతో ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను తెలుసుకోవడం, పార్టీ తరఫున కార్యకర్తలను కష్టాల్లో ఆదుకోవడంపై దృష్టి సారించేందుకు అవకాశం ఏర్పడుతుందని పార్టీ నేతలంటున్నారు.

 

పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు సంబంధించిన వివరాలను సమగ్రంగా సేకరించనున్నారు. కేవలం సభ్యత్వ నమోదు పుస్తకంలో వివరాలు రాయడమే కాకుండా, ఏ రోజుకారోజు సభ్యుల వివరాలన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. సభ్యత్వం తీసుకున్నవారి ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తదితర వివరాలను తీసుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: