తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలోనే పార్టీ మారతారు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల ముందు నుంచే ఈ వార్తలు ప్రచారంలో ఉన్నాయి కూడా. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందడంతో గంటా జంపింగ్ వార్తలు మరింతగా ఊపందుకున్నాయి.
ఇటీవల ఆయన కొలంబో వెళ్ళినప్పుడు.. విదేశాల నుంచి వస్తూనే నేరుగా ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. గంటా మాత్రం తాను తెలుగుదేశం లోనే కొనసాగుతున్నానని తేల్చి చెప్పారు. తాజాగా ఆయన విశాఖలోని ముఖ్యనేతలతో సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది.
ఇది సహజంగా జరిగే పార్టీ సమన్వయ సమావేశమేనని గంటా అనుచరులు చెబుతున్నారు. అయితే ఇటీవల కాకినాడలో కాపు నేతలంతా పెద్ద ఎత్తున సమావేశమైన నేపథ్యంలో గంటా భేటీ అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రం లోని కాపు నేతలు పెద్ద ఎత్తున బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
పాపం గంటా శ్రీనివాసరావు.. నేను పార్టీ మారడం లేదు మొర్రో అని ఎంతగా మొత్తుకుంటున్నా ఎవరూ నమ్మడం లేదు. ఆయన గత చరిత్ర అలాంటిది మరి.