తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అంబికా కృష్ణ ఆ పార్టీ కి షాక్ ఇస్తే ... ఆయన సోదరుడు అంబికా రాజా , అంబికా కృష్ణ కు గట్టి షాకే ఇచ్చారు . అంబికా కృష్ణ ఇటీవల టీడీపీ వీడి బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే . అంబికా కృష్ణ మాదిరిగానే,  ఆయన సోదరుడు ఆర్యవైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబికా రాజా కూడా బీజేపీ లో చేరనున్నారన్న  ప్రచారం జరిగింది . అయితే తాను బీజేపీ లో చేరుతున్నట్లుగా  జరుగుతున్న ప్రచారాన్ని  అంబికా రాజా ఖండించారు .


 తాజాగా  మీడియా ముందుకు వచ్చిన ఆయన   తన సోదరుడు  బీజేపీ లో చేరితే చేరి ఉండవచ్చునని ... తాను మాత్రం త్వరలోనే  వైకాపా లో చేరుతానని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చాడు . వైకాపా లో ఏ పదవి ఆశించి చేరబోవడం లేదన్న ఆయన , వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు మొదటి నుంచి అభిమానమని చెప్పారు . తన అభిమాన నేత కొడుకు నాయకత్వం లో పని చేయాలన్న ఉద్దేశ్యం తోనే , త్వరలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమక్షం లో వైకాపా లో చేరనున్నట్లు ప్రకటించారు . వైకాపా లో చేరడం ద్వారా ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాని వెల్లడించారు .


ఒక్కొక్కరు టీడీపీ నేతలు బీజేపీ , వైకాపా లోకి వలసలు వెళ్తుండడం తో ఆ పార్టీ  నాయకత్వం తలలు పెట్టుకుంటోంది . రాష్ట్రం లో బలపడాలని చూస్తున్న బీజేపీ , ప్రధానంగా టీడీపీ నేతలను, తమ పార్టీలోకి  ఆకర్షించే ప్రయత్నాలను చేస్తోంది . ప్రజాప్రతినిధులను చేర్చుకుంటే ఇబ్బందులు వస్తాయని భావిస్తోన్న ఆ పార్టీ నాయకత్వం, నేతలను ముందుగా చేర్చుకోవడం ద్వారా టీడీపీ కి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తోంది .ఇక టీడీపీ నుంచి పలువురు నేతలు , ప్రజాప్రతినిధులు వైకాపా లో చేరేందుకు రెడీ గా ఉన్నప్పటికీ , ఆ పార్టీ నాయకత్వం మాత్రం వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం తో వేరు వేచిచూసే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: