' బాబూ మా భూమిలో ఇల్లు కట్టుకో...'

అంటున్నారు అమరావతి రైతులు. అమరావతిలో చంద్రబాబు నివాసానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాజధాని రైతులు ముందుకు వచ్చారు. ప్రజావేదిక కూల్చివేతను వారు తప్పుపట్టారు. చంద్రబాబును కలిసేందుకు రాజధాని నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు తరలి వచ్చారు.

కరకట్టపై ఉన్న ఆస్పత్రి గోకరాజు గంగరాజుదని, ఆయన బీజేపీ నేతఅని అందుకే ప్రభుత్వం ఆస్పత్రి జోలుకెళ్లలేదని రైతులు విమర్శించారు. ముందు అవి కూల్చకుండా ప్రజావేదిక, చంద్రబాబు నివాసాలను కూల్చడమేంటని వారు ప్రశ్నించారు. ఇంకా అక్రమకట్టడాలు చాలా ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చలేదని రైతులు ప్రశ్నించారు.

చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేయవలసి వస్తే.. వెలగపూడిలోగానీ, రావిపూడి, తుళ్లూరు గ్రామం.. చుట్టుపక్కల చంద్రబాబు నివాసానికి అనువైన స్థలం ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని రైతులు స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: