30 డేస్‌. 30 వండర్స్‌!!

ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి వై.ఎస్‌ .జగన్‌ ఏం సాధిస్తారు అని తెలుగు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూశారు. నెల రోజుల్లోనే పెను మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్‌ జగన్‌, పాలనలో తనదైన ముద్ర వేసి స్వచ్ఛ పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ ని నడిపిస్తున్నారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టిన వైఎస్‌ జగన్‌ తొలి నెల రోజుల పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలివి.

1, అవ్వాతాతలు ఆశీస్సులు కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీసి నెల రోజులు పాలన సాగింది.

2, బాక్సైడ్‌ తవ్వకాల రద్దు అనేది ప్రజా ఉద్యమాలను,ఆకాంక్షలను గౌరవించడం.

3, గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయంతో గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు.

4, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు కేటాయిస్తూ రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు.  పార్టీ ఫిరాయింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోనని అసెంబ్లీ సాక్షిగా చెబుతూ రాజ్యాంగ విలువల పరిరక్షణకు నిబద్ధుడయ్యారు.

5, అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రజావేదిక నుంచే ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతోపాటు క్రిష్ణా నది కరకట్ట మీద అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంసిద్ధమయ్యారు. 6,రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించే పథకానికి రూపకల్పన చేయాలని నిర్ణయించారు.

7, మంత్రులూ, ప్రతి కలెక్టర్‌, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మేనిఫెస్టో కాపీలు ఉండాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టో అమలుకు కట్టుబడ్డారు.

8, మంత్రివర్గంలో 50 శాతం పదవులు ఆయా వర్గాలకు కేటాయించి తాను చేతల మనిషినని నిరూపించుకున్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. ఆ వర్గాలకు కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్‌ను చేశారు.

9,చంద్రబాబు చేసినట్లు తాను రాజ్యాంగాన్ని అపహాస్యం చేయనని అసెంబ్లీలోనే ప్రకటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలన్నదే తన విధానమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని తేల్చిచెప్పారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు.

10, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తూ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములను చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తన మంత్రివర్గంలో మంత్రులు డమ్మీలు కారని, వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని చెప్పారు.

11, మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే విచారిస్తానని... రుజువైతే పదవుల నుంచి తక్షణమే తొలగిస్తానని తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు.

12, రబీ సీజన్‌ నుంచే వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలు . పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500.. అందుకోసం రూ.13,125 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సన్నద్ధం.

13, పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు రూ.3 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి . కౌలు రైతులకు గుర్తింపు కార్డులు

14, అవ్వాతాతల పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. యదాంతో కొత్తగా 5.50 లక్షల మందికి పింఛన్లు అందే అవకాశం

15, డయాలసిస్‌ చేయించుకుంటున్న మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ నెలకు రూ.3,500 నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంపు.

16, ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. రాష్ట్రంలో 42 వేల మందికి లబ్ధి

17, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు రూ.11,500కు పెంపు.. రాష్ట్రంలో 55 వేల మందికి ప్రయోజనం 18, పారిశుధ్య కార్మికుల జీతాలు ఏకంగా రూ.

18 వేలకు పెంపు

19,- హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల జీతాలు సైతం పెంపు

20, వ్యవసాయ రంగ స్థితిగతులపై అధ్యయనం చేసి రైతులకు దిశానిర్దేశం చేసేందుకు వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు

21, ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీర్‌ . దాంతో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు

22, అక్టోబర్‌ 2 (గాంధీ జయంతి) నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు

23,ప్రతి గ్రామ పంచాయతీలో పది మంది ఉద్యోగుల నియామకం .మొత్తం మీద రాష్ట్రంలో 13,060 గ్రామాల్లో 5.60 లక్షల మందికి ఉద్యోగాలు

24, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌

25, తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివించినా పేద తల్లులకు ఏడాదికి రూ.15 వేలు

26, మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్‌ విద్యకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపు

27, అక్టోబరు 1 నాటికి మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా తొలగింపు

28, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు

29, రాష్ట్ర ప్రయోజనాల సాధనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వంతో సీఎం వైఎస్‌ జగన్‌ సత్సంబంధాలకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఢిల్లీకి వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక సహాయం ప్రకటించాలని అభ్యర్థించారు.

30, గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో, కలిసి పనిచేయాలని నిర్ణయించడం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయి. ఇంకా నెరవేరని విభజన చట్టం సమస్యల పరిష్కారానికి, వైఎస్‌ జగన్‌ చొరవ చూపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆ దిశగా చర్చలను వేగవంతం చేశారు. ఈ నెల రోజుల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐదుసార్లు కలిసి చర్చలు జరపడం ఒక ముందడుగు.

'' యువ ముఖ్యమంత్రి జగన్‌ ఇంత అపూర్వ పాలన అందిస్తారని ఊహించ లేదు. సామాజిక న్యాయానికి కట్టుబడి, అవినీతిపై యుద్ధం చేస్తూ , సంక్షేమ రాజ్యం, గ్రామ స్వరాజ్యం కలల సాకారానికి వేగంగా అడుగులు వేస్తున్నారు ... గత పాలనలో కొందరు ఎమ్మెల్యేల నోటి దురుసు వల్ల ఆ టీడీపీ నష్టపోయింది. వైసీపీలో అలాంటి అహంకార సంప్రదాయం రాకుండా , జాగ్రత్త పడాలి '' అని, ఉత్తరాంధ్ర,రాయలసీమ,కోస్తా ప్రాంతాల్లోని కొందరు విద్యావంతులను ఫోన్‌ ద్వారా ఈ విలేకరి పలకరించినపుడు ముక్తకంఠంతో చెప్పారు. (ground study/shyammohan)

మరింత సమాచారం తెలుసుకోండి: