ప్రముఖ దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణంతో కృష్ణ కుంగిపోయారు.  ఆమె భౌతిక కాయకానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.  తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, అయన మంత్రివర్గం నివాళులు అర్పించింది.  


కెసిఆర్ వచ్చి వెళ్లిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వచ్చారు.  విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించాడు.  అనంతరం సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చారు.  ఆ సమయంలో మహేష్ బాబు అక్కడ లేరు.  ఆ తరువాత చంద్రబాబు కుటుంబం సూపర్ స్టార్ కృష్ణను కలిసి ఓదార్చింది.  ఆ సమయంలో మహేష్ బాబు అక్కడే ఉన్నారు.  


చంద్రబాబును రిసీవ్ చేసుకున్నారు.  బాబు అక్కడ ఉన్నంతసేపు మహేష్ అక్కడే ఉన్నారు.  జగన్ వచ్చిన సమయంలో మహేష్ బాబు అక్కడ లేకపోవడంపై జగన్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  కావాలనే మహేష్ అక్కడ లేదా లేదంటే ఏదైనా కారణం చేతనే మహేష్ రాలేదా అన్నది తెలియాలి. 


వైఎస్ కుటుంబానికి.. కృష్ణ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది.  జగన్ కు.. మహేష్ కు కూడా మంచి అనుబంధం ఉంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయాలపైన అనేక ట్రోల్స్ వస్తున్నాయి.  మహేష్ కావాలనే అక్కడ లేడని వార్తలు రావడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: