తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయబోతున్నారని సమాచారం. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలోకి వస్తే.. ఆ ముగ్గురిని గెలిపించుకునే బాధ్యతను వైకాపా తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో ఆ ముగ్గురు అందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ ముగ్గురు ఎవరు.. ఏంటి అనే విషయాలు స్పష్టంగా తెలియాలి.
తెలుగుదేశం పార్టీని వీడి అటు బీజేపీ, ఇటు వైకాపాలోకి వెళ్లేందుకు అనేకమంది రెడీగా ఉన్నారు. సిద్ధం అని చెప్తున్నారు గాని, ఆ విషయంలో ఒక్కరుకూడా అడుగు ముందుకు వేయడం లేదు. ఎందుకు అనే విషయం తెలియాలి.
తెలుగుదేశం పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం బయటకు రావడం లేదు. కేవలం ఇవి పుకార్లేనా లేదంటే నిజంగా పార్టీ మారుతున్నారా అన్నది తెలియడం లేదు.