తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది.  ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయబోతున్నారని సమాచారం. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  


ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలోకి వస్తే.. ఆ ముగ్గురిని గెలిపించుకునే బాధ్యతను వైకాపా తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో ఆ ముగ్గురు అందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.  అయితే, ఆ ముగ్గురు ఎవరు.. ఏంటి అనే విషయాలు స్పష్టంగా తెలియాలి.  


తెలుగుదేశం పార్టీని వీడి అటు బీజేపీ, ఇటు వైకాపాలోకి వెళ్లేందుకు అనేకమంది రెడీగా ఉన్నారు. సిద్ధం అని చెప్తున్నారు గాని, ఆ విషయంలో ఒక్కరుకూడా అడుగు ముందుకు వేయడం లేదు.  ఎందుకు అనే విషయం తెలియాలి.  


తెలుగుదేశం పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవుతున్నారని వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం బయటకు రావడం లేదు.  కేవలం ఇవి పుకార్లేనా లేదంటే నిజంగా పార్టీ మారుతున్నారా అన్నది తెలియడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: