ఆయన దేశంలోనే సీనియర్ నాయకుడు.. వాస్తవానికి కాదు కానీ.. అలా చెప్పుకోవడం ఆయన భలే ఇష్టం.. అవును మరి 40 ఏళ్ల సీనియారిటీ ఉంది. కాకపోతే.. ఆ సీనియారిటీ ఇప్పుడు వర్కవుట్ కావడం లేదు.


40 ఏళ్ల సీనియర్ కూడా కేవలం 40 రోజుల్లో మాట మార్చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మాటలను గుర్తు తెచ్చుకుంటే... వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ ఒకేటేనంటూ ఆయన ఎన్నోసార్లు కామెంట్ చేశారు.


మోడీ, జగన్, కేసీఆర్... ముగ్గురూ తనపై కక్ష కట్టారని గత ఎన్నికల ముందు సానుభూతి కోసం చంద్రబాబు విపరీతంగా ట్రై చేశారు. ఈ మూడు పార్టీల కుమ్మక్కు డైలాగులే ప్రతి ఎన్నికల సభలోనూ వల్లె వేశారు. కానీ ఇప్పుడు ఆయన ఎన్నికల తర్వాత మాట మార్చేశారు.


తాజాగా కుప్పంలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో వైసీపీ కలయిక ఎట్టి పరిస్థితుల్లో జరగదని తేల్చి చెప్పేశారు. బీజేపీ, వైసీపీ కలిస్తే వైసీపీ ఓటు బ్యాంకుకు తూట్లు పడతాయి అని కూడా విశ్లేషించారు. మరి ఇంతలోనే ఇంత మార్పు ఎందుకో అది చంద్రబాబుకే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: