మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడివుందని, మహిళల భాగస్వామ్యంతోనే సమాజ పురోగతి సాధించ గలమని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలున్నారని ఆమె గుర్తు చేశారు.
ముద్రా లాంటి పథకాలద్వారా మహిళా ఆర్థిక స్ధితి మెరుగుదలకు , మహిళా పారిశ్రామిక వేత్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. స్వయం సహాయక గ్రూప్ల(ఎస్ఎస్జీ) లో ఉన్న మహిళలకు రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్. ఒక్కో మహిళకు ముద్రా స్కీమ్ ద్వారా రూ.లక్ష దాకా రుణ సదుపాయం కల్పిస్తామని ఆమె చెప్పారు.
ఉజ్వల యోజన కింద 35కోట్ల ఎల్ఈడీ బల్పుల పంపిణీ. బల్పుల పంపిణీతో రూ.18341కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేయనున్నామన్నారు. కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తాంమని ప్రకటించిన ఆర్థికమంత్రి కార్మికులకు ప్రధాన మంత్రి పెన్షన్ యోజన కింది 30లక్షల మందికి లబ్ది చేకూరుస్తామని, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారు..