అమెరికాలో జరుగుతున్న తానా సభల తీరుపై విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు, వర్గాలకు అతీతంగా అమెరికాలోని తెలుగువారంతా ఐకమత్యంగా జరుపుకోవాల్సిన సభలు కేవలం టీడీపీకి అనుకూలంగా జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీ నేత రామ్ మాధవ్ ప్రసంగం వేళ టీడీపీ అభిమానులు అడ్డుపడటం అగ్నికి ఆజ్యం పోసింది.


తానా సభలు జరుగుతున్న తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బిజెపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు అవమానం జరగడంపై బిజెపి తీవ్రంగా స్పందించింది. బిజెపి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు.తానా సభలు టిడిపి భజన సభల్లా మారాయని ఆయన ట్విటర్ లో ధ్వజమెత్తారు.

రామ్ మాధవ్ జాతీయ వాద ప్రసంగానికి అడ్డు తగిలి అవమానించడం ద్వారా లోకేష్ గ్యాంగ్ తమ నీచ బుద్దిని ప్రదర్శించిందని ఆయన ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చతమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్టను దిగజార్చుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీతో పాటు మరికొన్ని పార్టీల నేతలు కూడా తానా సభలు జరుగుతున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: