తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ఆగేలా కనిపించడం లేదు. బీజేపీ నేతలు ఆశించినంత జోరుగా ఈ వలసలు లేకపోయినా.. అడపా దడపా కొందరు నేతలు టీడీపీ నుంచి వెళ్లిపోతూనే ఉన్నారు. అయితే వెళ్లేవారంతా బీజేపీలోకే వెళ్లడం విశేషం.


తాజాగా.. టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన బీజేపీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు సుజనాచౌదరితో మంచి సంబంధాలు ఉన్నాయి.


పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చందు సాంబశివరావు ప్రకటించారు. ఇప్పటికే ఓ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఇప్పటికే బీజేపీ గూటికి చేరిపోయారు.


ఇక చందు నేపథ్యంలో చూస్తే.. ఆయన నాసా, ఇస్రో వంటి సంస్థలతో శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు. అమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించారు. రాజకీయాల విషయానికి వస్తే.. టీడీపీలో చేరి 2004లో దుగ్గిరాల నియోజకవర్గం నుంచి పోటీచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: