అనుకున్నట్టే జరిగింది.. కుమార స్వామి సర్కారు కుప్పకూలింది. కుమార స్వామి సర్కారు అసెంబ్లీ విశ్వాసాన్ని పొందలేకపోయింది. విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో కుమార స్వామి మెజారిటీ సాధించలేకపోయారు.


కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా... తగినంత మెజారిటీ సాధించలేకపోవడంతో కుమార స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కథ ముగిసింది.


ఇక ఇప్పుడు గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది. అదే జరిగితే యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రి కావచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: