టుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త మద్యం విధానంపై చర్చజరుగుతున్న సమయంలో ఆమె బాలకృష్ణ ప్రవర్తనపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు హయాంలో తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఎవరిపైనా చర్య తీసుకోలేదని గుర్తు చేశారు.


ఈ సందర్భంగా ఆమె ఉదాహరణగా నందమూరి బాలకృష్ణ విషయాన్ని ప్రస్తావించారు. సాక్షాత్తూ ఎన్నికల బహిరంగ సభల్లోనే మద్యం తాగి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని చెప్పారు. బాలకృష్ణ మద్యం తాగి ఉర్దూ గీతాన్ని సరిగ్గా పాడలేకపోయారంటూ గుర్తు చేశారు.


ఇలాంటి ఘటనలపై చంద్రబాబు సర్కారు చూస్తూ ఊరుకుందని.. తమ ప్రభుత్వం అలా నిస్తేజంగా ఉండబోదని ఆమె అభిలషించారు. భవిష్యత్తులో బహిరంగ సభలకు వెళ్లే టీడీపీ నేతలకు ముందే బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించాలేమో అంటూ వ్యంగ్యంగా అన్నారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో పర్యటించిన నందమూరి బాలకృష్ణ.. మహ్మద్ ఇక్బాల్ రాసిన సారే జహాసే అచ్చా.. గీతాన్నిపాడబోయి అబాసుపాలయ్యారు. ఆ పాట పాడటం రాక.. బుల్ బుల్.. అంటూ నోటికొచ్చినట్టుపాడేశారు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. బాలయ్య ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: