సరస్వతీపుత్రునికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కెటిరామారావు సహాయాన్ని అందించారు. పేదరికాన్ని జయించిన సరస్వతి పుత్రుడు ఏంపటి కుష్వంత్ కి రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఐదు లక్షల సహాయాన్ని  ముఖ్యమంత్రి మంజూరు చేశారు. కుష్వంత్ కుటుంబం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురంలో ఉండేది. కొన్ని నెలల క్రితం అనిత భర్త లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో భూపాలపల్లికి బతుకు తెరువు కోసం వచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లిలో కుట్టు మిషన్ పనిచేస్తూ ,  తన కుమారులను పోషించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది .  అనిత కుమారుడు కుష్వంత్ తెలంగాణ ఎంసెట్ లో  రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో పాటు జాతీయ స్థాయి నీట్ పరీక్షలో 50వ ర్యాంక్ సాధించాడు .


 దీనితో పాటు ఏపీ ఎంసెట్ లోనూ  ఎనిమిదవ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు డీల్లీ ఏయిమ్స్ లో సీటు వచ్చింది. అయితే కుట్టు పనిచేసే తన తల్లి, కుష్వంత్ ఉన్నత చదువులకు అవసరం అయిన ఫీజులను భరించలేని నేపథ్యాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ సహాయం అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ మేరకు కుష్వంత్ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. ఈ రోజున మంత్రి శ్రీనివాస్ గౌడ్, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మపర్సన్ గండ్ర జ్యోతి సమక్షంలో ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన 5 లక్షల చెక్కును కేటీఆర్  అందించారు. కేటీఆర్  మరో ఇద్దరు విద్యార్దులకు సొంతంగా అర్ధిక సహాయం అందించారు.


 జాతీయ పోటీ పరీక్ష అత్యుత్తమ కనబర్చిన విద్యార్దిని ఫీజులకు అవసరం అయిన అర్ధిక సహాయం అందించారు. నేషనల్ ఇనిస్టిస్ట్యూట్   అప్ న్యూట్రిషన్ పోటీ పరీక్షలో దేశ వ్యాప్తంగా మెదటి ర్యాంకు సాధించిన కె. లావణ్య ఫీజుకు అవసరం అయిన అర్ధిక సహాయం అందించారు. మెడ్చేల్ జిల్లాలోని గాజుల రామారంకు చెందిన కె. లావణ్య తండ్రి స్ధానికంగా ఉన్న ఒక కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. తన తల్లిదండ్రులు పేదరికం వలన తనఫీజులు చెల్లించలేక పోతున్నానని కేటీఆర్  కు ట్విట్టర్ ద్వారా తన సమస్యను తెలిపింది. ఈమేరకు అమెకు అవసరం అయిన ఫీజుల తాలుకు అర్ధిక సహాయం అందించారు. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: