పోలవరం పేరుతో జరిగిన అవినీతికి అడ్డుకట్ట వేసి.. సర్కారు ఖజానాను కాపాడాలన్న కారణంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండర్లకు వెళ్తామంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే ఈ విషయం చెప్పారు. ఇప్పుడు అమలుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నవయుగ కంపెనీకి పనుల నుంచి తప్పుకోమని నోటీసులు కూడా ఇచ్చారు.
ఐతే..
పోలవరం విషయంలో జగన్
తీరును పార్లమెంట్ లో కేంద్ర
మంత్రి షెకావత్ తప్పుబట్టారన్న
వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వ నిర్ణయం
పోలవరం నిర్మాణానికి అవరోధమని,
మళ్లీ టెండర్లు పిలిచి
పూర్తి చేయాలంటే ఎంత సమయం
పడుతుందో చెప్పలేమని, రీ
టెండర్ల వల్ల ఖర్చు పెరుగుతుందని,
ఈ నష్టానికి వైకాపా
ప్రభుత్వమే బాధ్యత వహించాలని
కేంద్రమంత్రి పార్లమెంటులో
అన్నట్టు వార్తలు వచ్చాయి.
దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా జగన్ తీరును తప్పుబట్టారు. .. ఆయన తన ట్వీట్ లో ఏమన్నారంటే...
“ తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం, మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారు లోక్ సభ లో చెప్పారు.. పోలవరం ప్రాజెక్టు లో 2600 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటూ తల తిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది.పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ,కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ, సిడబ్ల్యుసి, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్రవ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమయింది... అంటూ ట్వీట్ ద్వారా విమర్శల వర్షం కురిపించాడు.