దేశంలో కొంత కాలంగా కామాంధులు మహిళలపై యువతులపై చివరికి చిన్నారులపై అత్యాచారాలకు పాల్పపడుతూ..హత్యలు కూడా చేస్తున్నారు. అసలు మహిళలు పట్టపగలు బయటకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఇటీవల తెలంగాణలో వరుసగా అమ్మాయిల హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే..యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ముగ్గురు అమ్మాయిలను సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చాడు. 


ఆ మృతదేహాలను దగ్గరలోని పాడుబడ్డ బావిలో పూడ్చి పెట్టాడు.  పాపం బయటపడటంతో సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి దురాగతాలు ఒక్కక్కొటీ వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా ఇతడికి పలు నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.  ముగ్గరు అమ్మాయిలను తాను చంపానని ఒప్పుకోవడంతో కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించారు. హత్యలు జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్ ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు గుర్తించారు.  అతడి చేతిలో దారుణంగా హత్యకు గురైన  శ్రావణి, మనీషా, కల్పన మృతదేహాలపై రక్తపు మరకలను సేకరించిన పోలీసులు.. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా అవి శ్రీనివాస్‌రెడ్డివేనని తేల్చారు.


ఇక ఈ కేసులో మొత్తం 300మంది సాక్షులను విచారించిన పోలీసులు, సైకో కిల్లర్ అరాచకాలకు సంబంధించిన బలమైన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా, హన్మకొండలో నిద్రిస్తోన్న తొమ్మిదేళ్ల పసికందును ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేసిన ప్రవీణ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. దీనిపై యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తం చేశారు..ఇలాంటి దుర్మార్గులకు ఇదే సరైన శిక్ష అని పేర్కొన్నారు. 


కేవలం 48 రోజుల్లోనే నిందితుడికి శిక్ష విధించాలని వరంగల్ కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం. అమాయక అమ్మాయిలను అతి దారుణంగా అత్యాచారం చేసి ప్రాణాలతో బావిలో కప్పిపెట్టిన దుర్మార్గుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి కూడా ఉరిశిక్ష విధించాలని కుటుంబ బాధితులు, మహిళా సంఘాలు, తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: