వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో షాకింగ్ కామెంట్లు చేసారు. కొన్ని రోజుల నుండి ఆశా వర్కర్లు పెంచిన జీతాలను అమలు చేయాలని ఉద్యమాలు చేసారు. వైసీపీ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఈ నెల నుండి పెంచిన వేతనాలను అమలు చేస్తున్నామని వచ్చే నెలలో ఈ జీతాలను అందుకుంటారని తెలిపింది. విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ఆశా సిస్టర్ల జీతాలను 3 వేల రుపాయల నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పది వేల రుపాయలకు పెంచారు. 
 
జగన్మోహన్ రెడ్డి గారు ఆశా వర్కర్లకు జీతాలు పెంచటంతో చంద్రబాబు నాయుడుకు నిద్ర పట్టటం లేదు. ఆశావర్కర్లను ఉద్యోగాల నుండి తొలగిస్తారని, వేధిస్తున్నారని ఊహాజనితమైన విమర్శలతో చంద్రబాబు నాయుడు గారు శాడిస్ట్ ఆనందం పొందుతున్నారు. ఎల్లో మీడియా కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు తాళం వేస్తుంది అని కామెంట్ చేసారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం, యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ గురించి కూడా విజయసాయి రెడ్డి కామెంట్లు చేసారు. 
 
కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు. ప్రకృతి వనరులు వాళ్ళ బాబు గారి సొత్తు అయినట్టు బెల్లం ముక్కల్లా నమిలేశారు. కలుగులోని పందికొక్కులు అన్నీ చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా పేరు లేకుండా విజయసాయి రెడ్డి కామెంట్లు చేసారు. 
 
చంద్రబాబు నాయుడు అఙాత పార్ట్‌నర్‌ ఇప్పుడు యూ టర్నులు తీసుకునే మాస్టర్ అయ్యాడు. ఒకప్పుడు అమరావతిని ప్రజా రాజధాని కాదు టీడీపీ రాజధాని అన్న వ్యక్తి ప్రస్తుతం రాజధానిని అమరావతి నుండి మారిస్తే ఒప్పుకోనని అంటున్నాడు. మాటపై నిలబడలేని వ్యక్తి రాజకీయాలను ఏం మారుస్తారు అంటూ ట్వీట్ చేసాడు విజయసాయి రెడ్డి. 



మరింత సమాచారం తెలుసుకోండి: