తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తన కేబినేట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పోటు తప్పదా...? తెలంగాణ రాష్ట్ర సమితి లో ఇప్పుడు కేసీఆర్ కోటకు బీటలు పడబోతున్నాయా..? ఇంతకాలం నేనే మోనార్క్ను నన్నేవ్వరు మోసం చేయలేనని విర్రవీగే సీఎం కేసీఆర్కు ఇప్పుడు ఈటేల రాజేందర్తో తలనొప్పులు తప్పవా...? ఇప్పుడు టీ ఆర్ ఎస్కు ఈటెల పక్కెల బల్లేంలా తయారయ్యాడా... ఓ బీసీ మంత్రిని కేసీఆర్ తన మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తే రాబోయే రాజకీయ పరిణామాలు ఏలా ఉంటాయి.. కేసీఆర్కు ఇప్పుడు ఈటెల వ్యవహారం మింగుడు పడటం లేదా... ఇది తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో రేగుతున్న రాజకీయ ప్రకంపనలు.
ఇంతకు ఏమీ జరిగింది.. ఎలా జరిగింది... ఈటెల రాజేందర్ ఎందుకు టీ ఆర్ ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు... అసలు ఇంత ఎపిసోడ్ జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు... ఓ బీసీ మంత్రికి ఎందుకు ఎసరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.. అనే కోణంలో ఓమారు పరిశీలిస్తే... కేవలం మీడియా విసిరిన బాణం ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైందా అనేది తేలాల్సి ఉంది... అయితే తెలంగాణ వైధ్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విప్లవ భావాలు కలిగిన నేత. విద్యార్థి దశలో ఆయన వామపక్ష ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే టీ ఆర్ ఎస్ పార్టీని స్థాపించిన నాయకుల్లో ఓ బీసీ నాయకుడిగా ఒకరు.
కరీంనగర్ జిల్లాలో పరాజయం లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న బీసీ నేతగా గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి ఈటేలకు గుర్తింపు ఉంది. తెలంగాణ వచ్చిన వెంటనే ఈటెల రాజేందర్ కేసీఆర్ కేబీనేట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఎంతో సమర్ధవంతంగా తన శాఖను నిర్వహించిన రాజేందర్కు రెండోసారి కేబీనేట్లో తప్పని పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించారనే టాక్ ఉంది. అయితే ఇటీవల మీడియాలో కేసీఆర్ తమ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయం మీడియాలోనూ ప్రముఖంగా వస్తుంది.
దీంతో మంత్రివర్గంలో నుంచి ఈసారి ఈటెలను తప్పించనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ఈటెల సహానం కోల్పోయారు.. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ సభలో కొడుకా... నాకు మంత్రి పదవి బిక్షకాదు.. మేం గులాబి పార్టీ నేతలం... అంటూ పరుశంగా కామెంట్లు చేశాడు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడేక్కింది...ఈటెల చేసిన వ్యాఖ్యాలు కేసీఆర్ తనయుడు కేటీఆర్ను చేసాడనే టాక్ రాజకీయ వర్గాల్లో వ్యాపించింది. కేసీఆర్ తన కొడుకును మంత్రి ని చేసేందుకు ఈటెలకు ఉద్వాసన పలుకనున్నాడనే టాక్ రావడంతో ఈటెల చేసిన వ్యాఖ్యాలు నేరుగా కేటీఆర్నే చేశాడనే ప్రచారం జోరందుకుంది.. దీనికి తోడు తెలంగాణ లోని రాజకీయ పక్షాలు నిప్పుకు ఉప్పు కలిపినట్లుగా ఈటెలను భర్తరఫ్ చేయడం అంటే బీసీ నేతలను అవమానించినట్లే అని కామెంట్లు చేయడంతో ఇంకా రాజకీయం ముదిరింది.
ఇప్పుడు కేసీఆర్ ఈటెల మాటలకు నొచ్చుకోవడమే కాకుండా ఏమి చేయాలో తెలియని ఆయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడట. ఈటెలను మంత్రి వర్గం నుంచి తొలగిస్తే ఓ బీసీ మంత్రిని తన కొడుకు కోసం బలి చేసాడనే అపవాదు తప్పదు. అలా చేస్తే బీసీ ల నుంచి తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రాకతప్పదు. ఈటెలను తొలగిస్తే బీసీల నుంచి ప్రతిఘటన తప్పదు.. తొలగించకపోతే మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ నేతలు తిరుగుబాటు చేయక తప్పదు.. అందుకే ఇప్పుడు ఈటెలను కొడుకు కోసం తొలగించాలా... లేక గమ్మున ఊరుకోవడమా... లేక ఈటెలను తొలగించి మరో బీసీని మంత్రిగా చేయడమా... తేలాల్సి ఉంది.
ఇప్పుడు ఈటెలను మంత్రిగా తొలగించేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ మంత్రి వర్గంలో కేసీఆర్ వెలమాల సామాజిక వర్గానికి చెందిన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈటెల వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఈటెల వ్యవహారంపై ఎర్రబెల్లి స్పందించడం చూస్తుంటే ఈటెలను మంత్రిగా తప్పిస్తారనే టాక్ జోరుగా వినిపిస్తుంది. ఈటెలను తొలగిస్తే టీ ఆర్ ఎస్లో ముసలం తప్పేలా లేదనేటి టాక్. గతంలో కేసీఆర్ కేబీనెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను మంత్రి వర్గం నుంచి తొలగించారు.
రాజయ్యను తొలగించడానికి అవినీతి ఆరోపణలు కారణంగా బయటికి చూపినప్పటికి అంతర్గంతంగా మరో సమస్య ఉందటనేది బహిరంగ రహాస్యమే... డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో అనుకోకుండా జరిగిన ఓ అంతర్గత సంఘటన ఆయన పదవి పోయేందుకు కారణమైందనేది టాక్. ఇప్పుడు మరి ఈటెలను ఎందుకు తొలగిస్తారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పక తప్పదు.. అందుకే ఈటెలను తొలగిస్తే బీసీ సామాజిక వర్గం నుంచి ప్రతిదాడి తప్పదు గాక తప్పదు.. దీనికి తోడు ఆనాడు రాజయ్యను తొలగిస్తే రాజయ్య కిమ్మనకుండా ఉండిపోయాడు.
కానీ ఈటేల అలాంటి రకం కాదు.. ఒకవేళ మంత్రిగా తొలగిస్తే ఆయన అనేక వేదికల మీద బహిరంగాగానే విమర్శలు చేయడంలో దిట్ట. అందుకే ఈటెలను తొలగిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో.. కేసీఆర్ మెడకు ఎలా రాజకీయాలు చుట్టుకుంటాయో వేచి చూడాలి... కొసమెరుపు ఎంటంటే.. ఈటెలను మంత్రి వర్గం నుంచి సాగనంపితే...పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ కాచుకు కూర్చుంది.. అందుకే టీ ఆర్ ఎస్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా బీజేపీ గమనిస్తుందట...