మిజోరామ్ లోని ఐజాల్లోని ఆరు వేర్వేరు పాఠశాలల విద్యార్థులు సోమవారం మిజో సమాజానికి చెందనివారిని వివాహం చేసుకోమని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞను రాష్ట్ర అత్యున్నత విద్యార్థుల సంఘం - మిజో జిగ్లాయ్ పాల్ (MZP) నిర్వహించింది .. 2015 లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్  2న జరిగే ఈ ప్రచారం విద్యార్థులను అంతర్- జాతి , అంతర్- సమాజ వివాహాలకు వ్యతిరేకంగా సున్నితం చేయడానికి ఉద్దేశించబడింది . గిరిజనేతరులతో వివాహాలకు వ్యతిరేకంగా ఈ ప్రచారం అప్పట్లో మొదలు పెట్టారు , దాని వల్ల మిజో సమాజాన్ని నాశనం అవుతుందని వారు భయపడి దానిని మొదలు పెట్టారు. మిజో గిరిజన సంస్కృతి మరియు గుర్తింపును కాపాడటం కూడా దీని ప్రధాన లక్ష్యం.

ఈ కార్యక్రమంలో MZP అధ్యక్షుడు ఎల్ రామ్ దిల్లియానా రెంతెలీ మాట్లాడుతూ, “మా మిజో సంస్కృతిని దాని గుర్తింపును పరిరక్షించడానికి మా స్వంత సమాజంలోనే వివాహం చేసుకోవడమే ఉత్తమ మార్గం. మాది చాలా చిన్న సంఘం మేము మా సంఘం బయటి వారిని వివాహం చేసుకుంటే మా జాతి మొత్తం త్వరగా క్షీనిస్తుంది. గిరిజనేతరులను వివాహం చేసుకునే వారిని ద్రోహులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వారి వారసులు కూడా గిరిజనులు అనుభవించే అర్హతలను పొందగలరు. " అని అన్నారు.

ఇప్పటికే రీయాంగ్, చక్మా, బెంగాలీ మరియు ఇతర జాతులు తమ సొంత సమాజంలోనే వివాహం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు .  మిజో మహిళను గిరిజనేతరుని వివాహం చేసుకుంటే ఆమె గిరిజన హక్కుల నుండి నిషేధించే మిజో ఆచార చట్టం గురించి రెంతెలీ మరింత వివరించాడు. చట్టం ప్రకారం, అలాంటి మహిళల పిల్లలు కూడా గిరిజన హక్కులను పొందలేరు అని తెలిపారు.  గత సంవత్సరం , రాష్ట్రంలోని అతిపెద్ద ఎన్జిఓ , యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఎ), మిజో కాని మహిళను వివాహం చేసుకున్న మిజో మహిళ యొక్క షెడ్యూల్డ్ తెగ స్థితిని తొలగించే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.

ప్రచారం ప్రారంభించిన ఆరు పాఠశాలలు:
1. ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాల
2. జెఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్
3. రిపబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్
4. సెయింట్ జోసెఫ్ హయ్యర్ సెకండరీ స్కూల్
5. బ్రైటర్ హయ్యర్ సెకండరీ స్కూల్
6. లివింగ్ వాటర్ హయ్యర్ సెకండరీ స్కూల్


మరింత సమాచారం తెలుసుకోండి: