హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక ఫైన్ సిగ్నల్ దాటితే ఒక ఫైన్ అంటూ ఇలా ఫైనల్ రేట్ ను పెంచుతూ వెళ్తున్నారు కానీ దానికి ఎవరు బాధపడడం లేదు పైగా ఎవరు భయపడడం కూడా లేదు. వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు అలాగే కొనసాగించు కుంటున్నారు. అవసరమైతే ఫైన్ కట్టడానికి అయినా సిద్ధపడుతున్నారు కానీ వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇష్టపడడం లేదు.
ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించని అన్నిటికీ కూడా వెహికల్ ఇన్సూరెన్స్ ను విపరీతంగా పెంచుతారు అట. ఇప్పటికే ఫైన్ మోత మోగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఇకపై నుంచి ఇన్సూరెన్స్ రేట్ ను పెంచి దాని మీద కూడా బాదులు విధించే అవకాశం చాలా వరకు ఉంది. దీనిని ప్రజలు ఎంత వరకు పాటిస్తారు ఇంకా వేచి చూడవలసి ఉంది.
ఇన్సూరెన్స్ పెంపకం అనేది బండి కొనుక్కున్న అప్పటి నుంచే మొదలు అవుతుందా లేక మధ్యలో నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ ని పెంచి కట్టుకోవాలా అన్న అనుమానం అందరి లోని తలెత్తుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల బాగోగుల కోసం ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలి అని ప్రభుత్వం మన కోసమే ఈ మంచి తీసుకువస్తోంది అర్థం చేసుకోవాలని కోరుకుందాం.