దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో ఘోరం జరిగింది. సెప్టెంబర్ 2న అర్ధరాత్రి జీతం డబ్బుల తీసుకోవడానికి వచ్చినా మాజీ మహిళా ఉద్యోగిపై యజమాని మద్యం మత్తులో అత్యాచారం చెయ్యడంతో పాటు ఆమెకి డ్రగ్స్ ఇచ్చి వేశ్యా వాటికలో వదిలేసి వెళ్లిపోయాడు ఆ యజమాని. 


ఇంకా వివరాల్లోకి వెళ్తే .. ముంబైలోని గోరేగావ్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు క్యాటరింగ్‌ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలు గతంలో అతని దగ్గర ఉద్యోగం చేసి ఆ తర్వాత కొన్ని రోజులకు పని మానేసింది. అయితే ఆమెకు రావాల్సిన జీతం డబ్బులలో కొంత రావాల్సి ఉండటంతో ఆ డబ్బులు ఇవ్వాలని యజమానిని కోరింది. 


దీంతో ఆ యజమాని డబ్బు ఇస్తా అని సెప్టెంబరు 2న అంధేరి మెట్రో స్టేషన్‌ వద్దకు రమ్మన్నాడు. ఆ తర్వాత యువతిని బీచ్‌కు తీసుకెళ్లగా, ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువతిని వేశ్యలకు నిలయమైన కామాటిపురా ప్రాంతానికి తీసుకెళ్లాడు. 


ఆ వేశ్య వాటికలో ఒక రూమ్ బుక్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెకు డ్రగ్స్ ఇచ్చి యువతిని అక్కడే వేశ్య వాటికలో వదిలేసి వెళ్లిపోయాడు. ఉదయం లేచిన ఆ యువతీ జరిగిన ఘోరాన్ని గుర్తించి నాగ్‌పడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 


వైద్య పరీక్షల అనంతరం ముంబైలో యువతికి తెలిసిన వారు ఎవరు లేకపోవడంతో పోలీసులు ఆమెను సంరక్షణ గృహానికి తరలించారు. నిందితుడి కోసం గాలించినా పోలీసులు సెప్టెంబర్ 5 న నిందితుడిని అతని ఇంట్లోనే అరెస్ట్ చేశారు. కాగా మరోవైపు కామాటిపురంలో అద్దెకిచ్చిన 45 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: