స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన వ్యవసాయ పొలంలో ఒక మృతదేహం దొరికింది. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఈ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తుంది. అక్కినేని నాగార్జునకు షాద్ నగర్ లోని పాపిరెడ్డిగూడలో వ్యవసాయ పొలాలు ఉన్నాయి. గత వారం నాగార్జున ఈ పొలాన్ని చూడటానికి తన భార్యతో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో భార్య అమలతో కలిసి కొన్ని మొక్కలను కూడా నాగార్జున నాటాడు. ఈ వ్యవసాయ పొలంలో పంటలు పండించాలని కూడా నాగార్జున అనుకున్నట్లు తెలుస్తోంది. 
 
పంటలు పండించటం కొరకు కొంతమంది నిపుణులను పొలాన్ని చూడటం కొరకు పంపించాడు నాగార్జున. అక్కడికి వెళ్లిన నిపుణులకు కుళ్లిన వాసన రావటంతో అక్కడ ఉన్న ఒక గదిలో చూడగా ఆ గదిలో వారు కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించటం జరిగింది. ప్రస్తుతం మృతదేహం ఎముకలగూడులా మారిపోయిన స్థితిలో ఉంది. మృతదేహం ఎవరిదని గుర్తించటం కూడా చాలా కష్టమవుతున్నట్లు తెలుస్తోంది. 
 
నిపుణులు వెంటనే మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం లభ్యమైన గదిని సీజ్ చేశారు. దొరికిన మృతదేహానికి పోలీసులు ఈరోజు పోస్టుమార్టం నిర్వహించబోతున్నారని సమాచారం. స్థానికులు మృతదేహం ఆడవారిదై ఉండవచ్చని అంచనా వేసున్నారు. ఈ మృతదేహం విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మృతదేహం ఎవరిది ? నాగార్జునకు సంబంధించిన పొలంలో ఈ మృతదేహం ఎందుకుంది ? ఎన్ని రోజుల నుండి ఈ మృతదేహం ఇక్కడ ఉంది ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం తరువాత మృతదేహం గురించి కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. నాగార్జున ఈ విషయం గురించి ఇంకా స్పందించలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: