బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన మాట నిలుపుకున్నారు. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30ఏళ్ల పాటు బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను సీఎం జగన్ రద్దు చేశారు. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్-1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తకొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు.



విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని రిజర్ట్ ఫారెస్ట్ ప్రాంతంలో అపారమైన బాక్సైట్‌ ఖనిజ సంపద ఉంది.ఖనిజం కోసం కొండలను తవ్వేస్తే తమ జీవనానికి, సాంస్కృతిక వారసత్వానికే కాదు అటవీ, పర్యావరణానికి విఘాతం కలుగుతుందనే భయాందోళనలతో 50 ఏళ్లుగా గిరిజనులు పోరాటం చేస్తున్నారు.ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గిరిజనుల పోరాటానికి జగన్ అండగా నిలిచారు. అధికారంలోకి రాగానే బాక్సైట్‌ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు.



ఇప్పుడా మాటను నిలుపుకున్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్‌ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్‌ ఇటీవలే చెప్పారు. బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన సీఎం జగన్ అంటూ కృతజ్ఞతలు తెలుపుతు న్నారు. గిరిజనుల పక్షాన ఉన్నట్టు సీఎం జగన్ నిరూపించారు. బాక్సైట్‌ అనుకూల జీవో నెంబర్ 97ను రద్దు నిర్ణయం చరిత్రాత్మకం. జగనన్న కు గిరిజనులు ఎల్లపుడూ రుణపడి ఉంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: