వస్తున్నా మీకోసం అని చంద్రబాబుగారు చేసిన పాదయాత్రకు నేటికి 7 సంవత్సరాలు. 2817 కిలోమీటర్ల సుధీర్ఘ యాత్రను 63 ఏళ్ల వయసులో కూడా అలుపులేకుండా పూర్తిచేసి ప్రజలలో చైతన్యం నింపారు. రాష్ట్రమంతా తన కుటుంబమే అనుకుని ప్రజలకు మంచి చెయ్యాలనే సత్సంకల్పంతో చేసిన ఆ యాత్ర ఒక ప్రభంజనం అంటూ లోకేష్ చేసిన ట్విట్టర్ కు ఇప్పుడు భలే నవ్వొస్తుంది లేండీ.. ఎందుకంటే మనల్ని ఎవ్వరు పొగడక పోతే.. ఎవరికి వారే పొగుడుకుని జబ్బలు చరుచుకుంటూ.. శభాష్ అని తనకు తానే మురిసిపోయే రకం కొందరు ఉంటారు.
ఇప్పుడు ట్విట్టర్ పిట్ట లోకేషాలు చేసిన తన ట్విట్టర్ ఖాతాలో వస్తున్నా మీకోసం అని ఆనాడు చంద్రబాబు చేసిన పాదయాత్ర గురించి గొప్పగా చెపుతూ పోస్టు చేశారు. ఈ పోస్టు చూస్తుంటే నెటిజన్లు నవ్వుకునేలా ఉంది.. ఏనాడో టీడీపీ అధినేత చంద్రాలు పాదయాత్ర చేసి ప్రజల కోసం తిరిగాడని ఆయన పుత్రరత్నం ట్విట్టర్లో ట్విట్టాడు.. అసలు లోకేషాలుకు తెలుసా.. ఆయన తండ్రికి అధికారం లేకపోతే.. కల్లుతాగిన కోతిలా గెంతుతాడనే విషయం.. ఎందుకంటే గత మూడు పర్యాయాలు చంద్రాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన కాలంలో ఆయన ఎక్కువగా చేసిన విమర్శలు అలాగే ఉంటాయి.. ఈ చంద్రాలుకు కొంత మీడియా సపోర్టు దొరికింది అంతే.. గానీ లేకుంటే.. ఏనాడో చంద్రాలు కాలగర్భంలో కలిసిపోయేవారు.
ఇంతకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేష్ ట్విట్టర్లో రాసిన రాతలకు నెటిజన్లు ఎమనుకుంటున్నారంటే...వస్తున్నా మీ కోసం అంటూ.. నీ అయ్య చంద్రాలు చేసిన పాదయాత్ర జనం కోసం కాదయ్య బాబు... అది నీ అయ్యకు అధికారం కోసం.. నీకు
మంత్రి పదవి కోసం.. చేసిన యాత్ర అని మరువకు.. అన్ని కిలోమీటర్లు తిరిగింది.. వస్తున్నా మీకోసం అన్నారు.. కానీ.. వస్తున్నా నా కోసం.. నా కొడుకు కోసం అంటే బాగుండేది.. మీరు ప్రజల కోసం తిరిగితే మీరు ప్రజలకేమిచ్చారు.. చిప్ప చేతికిచ్చారు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు.. యువతను నిర్విర్యం చేసారు.. అంతే కానీ మిమ్మల్ని జనాలు నిర్విర్యం చేయలేదు సరికదా.. మీరేదో పొడుస్తారని.. మీకే కుర్చిలిచ్చారు ఆ జనాలు.. కానీ మీరు చేసింది తలుచుకుని జనాలు వైసీపీని అధికారంలోకి తెచ్చారు..
ఇప్పుడు మీరు ఆవేశపడి విమర్శలు చేస్తున్నారు.. కానీ మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే.. మీకు ఐదేండ్లు అధికారం ఇచ్చిన జనాలకు మీరు మంచి చేస్తే జగన్ను ఎందుకు సీఎంను చేసేవారు మీరే ఒకసారి ఆలోచించుకోవాలి.. ఐదేండ్లలో మీరు చేయలేని పనులను ఆయన కేవలం నాలుగు నెలల్లో ఎలా చేయగలరు.. అని ఆత్మ విమర్శ చేసుకోవాలి అంతే కానీ.. అయిందానికి కానిదానికి విమర్శలు చేస్తే జనంలో మీరే పలుచనవుతారు... తప్పితే మీకు ఒరిగేది ఏమీ లేదు.. ఏదో ప్రతిపక్షం కనుక గావుకేకలు పెట్టామంటే ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితి లేదయ్యా లోకేషాలు.. ఎందుకంటే నీకన్నా ముందుగానే జనాలు అప్డేట్ అయ్యారు.. కానీ మీ అయ్య.. నీ పార్టీ నేతలు.. నీవే ఇంకా అప్డేట్ కాకుండా పోయి.. ఆప్సెట్ అవుతున్నారు.. అందుకే జనాలకు ఏమీ కావాలో అది చేయండి.. కానీ ఉత్తుత్తగనే ఓ పోస్టు ట్విట్టర్లో పెట్టి జనాలకు వదిలేస్తే దీనితో జనాల్లో పలుచనయ్యేదీ మీరే లోకేషాలు అంటున్నారు జనాలు..