ఇటీవల జరిగిన ఒక న్యూస్ ఛానల్ జరిగిన పబ్లిక్ డిబేట్లో వైఎస్సార్సీపీ నేతలు బాగా రెచ్చిపోయారు. పరుష పదజాలంతో నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతను దుర్భాషలాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారగా.. వైఎస్సార్సీపీ నేత తీరుపై టీడీపీతో పాటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.ఇక ఇలాంటి విషయాలు మన సమాజంలో త్వరగా వైరల్గా మారిపోతుంది.ఒక వైపు టీడీపీ మరో వైపు వైసీపీ నేతల విమర్శలు చాలా వైరల్గా మారుతుంది.
ఇక తాజాగా ఈ వీడియోను మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూసి, దీనికి అనుగుణంగా ఒక ట్వీట్ చేశారు. ప్రజలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా ఎలా మాటలు తూలుతున్నారో చూడండి అంటూ ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా ట్వీట్ లో పోస్ట్ చేశారు. నిజానికి ఈ పోస్ట్ లో ఏమి ఉందిఅంటే ‘చేతకాని వాళ్ళకు నోరు ఎక్కువ అంటారు. సీఎం జగన్ గారూ.. మీరు చేపడుతున్న తుగ్లక్ పనులను ఎలా సమర్థించుకోవాలో తెలీక, మీ పార్టీ అధికార ప్రతినిధులు ఎలా అసహనానికి గురవుతున్నారో చూడండి.
ప్రజలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా ఎలా మాటలు తూలుతున్నారో చూసి గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం’అంటూ లోకేష్ ట్వీటారు చేశారు.
ఇక గ్రామా సచివాలయ వ్యవస్థ ప్రారంభం కావడంతో.. దీనిపై ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ చర్చ నిర్వహించింది. ఈ చర్చకు టీడీపీ నుంచి టీఎన్ఎస్ఎఫ్ నేత బ్రహ్మం, వైఎస్సార్సీ తరుపున రవిచంద్రారెడ్డి వెళ్లారు. చర్చ మధ్యలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం బాగా మోడలింది.
వెంటనే రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేత నోర్మూయ్ వెదవ, చెప్పుతో కొడతా రా అంటూ పరుష పదజాలంతో ఎగిరెగిరి పడ్డారు. ఇలాంటివి ప్రజలు చుస్తే నవ్వుకుంటారు.
ఇలాంటి ఆరోపణలు ఒకరి మీద ఒకరు ఎపుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు.