ఇక పూర్తి వివరాలలోకి వెళితే చరాస్తుల విలవ రూ 11.38 కోట్లు కాగా, రూ 4.67 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఆదిత్య ప్రస్తుతం రూ 6.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కలిగిఉన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమనల్ కేసులు కూడా లేవు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వొర్లి నుంచి బరిలో దిగిన సందర్భంలో ఆదిత్య తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు.
ఠాక్రే కుటుంబ సభ్యుడు మొదటి సరి కావడం వలన అతని పై అందరి ద్రుష్టి ఉంచారు. ఈ ఎన్నికలలో శివసేన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో లేదో అందరూ ఆలోచనలు చేస్తునారు. ఈ ఎన్నికలలో శివ సేనకు బీజేపీ ప్రభుత్వం ఎంత వరకు విజయం సాదించగలదో అని మహారాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజలు తమ లెక్కలు వేసుకుంటున్నారు.