ప్రపంచం అంత ఉలిక్కిపడేలా ఒక సంచలన వ్యాఖ్య చేశారు సౌదీ ఆరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్. ఇటీవల ఒక ఇంగ్లిషు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రపంచ దేశాలన్ని కలిసికట్టుగా
ఇరాన్ ను కట్టడి చేయకపోతే.. చమురు ధరలు ఎవరూ ఊహించని రీతిలో పెరుగుతాయని చెప్పారు.ఈ ప్రకటనపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు అంతర్జాతీయ సమాజం ముందు ఎన్నోసార్లు పరువు పోగొట్టుకున్న
పాకిస్థాన్ ఇప్పుడు
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన పనికి ఇంకోసారి కూడా నవ్వులపాలైంది. ఐరాస సమావేశానికి వెళ్లే ముందు పాక్ అధ్యక్షుడు
ఇమ్రాన్ ఖాన్ సౌదీ పర్యటనకు వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అక్కడి నుండి అమెరికా వచ్చేటపుడు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ తన స్వంత ఫ్లయిట్ ఇచ్చి ఇమ్రాన్ ను అమెరికా పంపించాడు. ఇమ్రాన్ తన పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి తిరిగి న్యూయార్క్ వెళ్ళాడు. న్యూయార్క్ నుండి పాక్ కి ఒక సాధారణ ఫ్లైట్ లో వచ్చాడు ఇమ్రాన్.
కానీ ఇదంతా అబద్దమని... అసలు జరిగింది వేరే అంటూ ఫ్రైడే టైమ్స్ పత్రిక. ఇమ్రాన్ ఐరాసలో ప్రసంగించిన విధానం అతని దౌత్య నీతి నచ్చక తన ఫ్లైట్ ను తితిగి అప్పగించాలని ఇమ్రాన్ ని యువరాజు బెదిరించారు అని ఈ పత్రిక తెలియచేసింది. తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా
ఇరాన్ తో చర్చలు జరపడం కూడా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కోపానికి కూడా ఒక పెద్ద కారణమైందని తెలుస్తుంది.
అంతేకాదు
టర్కీ అధక్షుడు ఎర్డోగన్
మలేషియా ప్రధాని మహతిర్ లతో కలిసి ఇస్లామిక్ దేశాల వాదన చెప్పడం కూడా యువరాజుకి ఇష్టం లేదని తెలుస్తుంది. ఈ కారణం వల్లనే తన ఫ్లైట్ తనకు వెంటనే తిరిగి అప్పగించాలని మహమ్మద్ బిన్ ఇమ్రాన్ ని హెచ్చరించినట్టు ఆ పత్రిక పేర్కొంది.