నేను ఉన్నాను...,, నేను విన్నాను...,, నేను చేస్తాను...,, అన్న మాదిరిగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని..,, ప్రజల కోసమే జగన్ పనిచేస్తున్నట్లుగా రాష్ట్రం కనిపించనుంది. పాలనలో దూసుకెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలతో తనదైన శైలిని చూపిస్తూ.. ఎన్నికల హామీలతో పాటూ మరెన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు... తాజాగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై సీఎం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పించనున్నట్లుగా జగన్ తెలిపారు.


ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం.. సాధారణ పరిపాలనశాఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో డిసెంబర్ 1న  కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేన్నామని కూడా సీఎం సూచించారు. అలాగే వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా కనిపించనుంది. ఔట్ సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థను కట్టడి చేసేందుకు గాను ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కార్పొరేషన్‌కు అనుసందిస్తూ జిల్లాస్థాయిలో విభాగాలకు గాను జిల్లా ఇంఛార్జ్ మంత్రి నేతృత్వం వహిస్తారని., ఎక్స్ అఫిషియోగా కలెక్టర్ ఉంటారని సూచించారు..

అంతేగాక ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అందరికీ ఒకే రకమైన నిబంధనలు విధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఒకే పనికి ఒకే రకమైన వేతనం.. అది కూడా ఆన్‌లైన్‌ పద్థతిలో జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఒక వైపు ఆర్టీసీ వారిని., మరోవైపు ఆటో వారిని., ఇప్పుడు ఉద్యోగుల విషయంలో జగన్ చేస్తున్న పని తీరు ఎంతగానో ప్రజల్ని ఆకర్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: