కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిఆరోగ్య శ్రీన అయుష్మన్ భారత్ యోజన పథకం కంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం చాలా మెరుగైనది అని తెలంగాణ రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ వేదికగా మరోసారి తేల్చి చెప్పారు. ఢిల్లీ లో రెండు రోజుల పాటు జరుగుతున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమావేశానికి  తెలంగాణ మంత్రి ఈటల హాజరయ్యారు. ఈ సమావేశానికి కో చైర్మన్ గా మంత్రి ఈటల ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ చైర్మన్ గానూ, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ వైస్ చైర్మన్ గా  వ్యవహరిస్తున్నారు.


తెలంగాణ మంత్రి కో చైర్మన్ గా ఎంపికావడం విశేషం. ఈ సందర్బంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ పధకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కేవలం 24 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. అదే ఆరోగ్యశ్రీ వల్ల అయితే  85 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే చికిత్సల్లో అత్యధికంగా ఐదు లక్షలు మాత్రమే రోగులకు ఇస్తున్నారని.. తెలంగాణలో ఉన్న ఆరోగ్యశ్రీ తో మూత్రపిండాలు,  గుండె కూడా మార్పిడి చేస్తున్నామని దీనికి 13 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వాదనను గట్టిగా వినిపించిన మంత్రి ఈటెల, తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్ కి ఎక్కువ మద్దతు అందించాలని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద సిబ్బందికి కూడా నిధులు పెంచాలని ఈటల రాజేందర్ కోరారు.



ఎన్ హెచ్ ఎం కింద రాష్ట్రంలో పనిచేస్తున్న వారందరికీ జీత భత్యాలు అందించాలని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం  ప్రాథమిక ఆరోగ్యానికి మాత్రమే సాయం అందిస్తుంది అలాకాకుండా సెకండరీ, టర్షరీ స్థాయిలో ఉన్న ఆసుపత్రులకు కూడా  అవసరమైన నిధులు  అందించాలని సమావేశంలో మంత్రి కోరారు. ఈ సమావేశం రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సమన్వయాన్ని పెంచాలని సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు నేరుగా రాష్ట్రాలకు అందించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: