పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ తెలియంది కాదు. ఆయన్ని ఆరాధ్య దైవంగా భావించే వాళ్ళు అనేక మంది ఉన్నారు.ఎక్కడ ఏ ఫిలిం స్టార్ కి లేని అంత మంది ఫాన్స్ అయన సొంతం. తాజాగా జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.వివరాలు లోకి వెళ్తే అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. తనకు ఈమధ్య పెళ్లి కుదరటం తో, తన పెళ్లి శుభలేఖల మీద సహజంగా మొదట దేవుడి ఫొటోలు వేస్తారు.
అయితే ఈ వీరాభిమాని మాత్రం తనకు పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం, నా దేవుడు అంటూ తన పెళ్లి శుభలేఖల మీద ఏకంగా జనసేన పార్టీ గుర్తు తో పాటు పవన్ కళ్యాణ్ ఫొటోలు కూడా ముద్రించారు . పెళ్లి శుభలేఖను కూడా జనసేన జెండా తరహాలో డిజైన్ చేయించారు. శుభలేఖ బ్యాక్ గ్రౌండ్లో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోను, జనసేన పార్టీ గుర్తు అయినా గ్లాస్ చిత్రాన్ని కూడా ముద్రించాడు. జనసేనను తలపించేలా శుభలేఖను డిజైన్ చేసారు అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీరాభిమాని విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి,తాను మొదటి నుండి పవన్ ఫ్యాన్ అని ,తనకు పెళ్లి కుదిరితే ఇలా జనసేన తరహాలో వెడ్డింగ్ కార్డును ముద్రించాలని ఆయనకి ఎప్పటినుండో కోరిక అని తెలిపారు.. అక్టోబర్ 13న న రాజేష్ రెడ్డికి హేమలతతో వివాహం నిశ్చమైంది. విశాఖపట్నంలో జరగబోయే ఈ పెళ్లికి తమ బంధువులు, స్నేహితులను పిలిచేందుకు ఈ వెడ్డింగ్ కార్డులు రెడీ చేసారు . ఈ శుభలేఖలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇలాంటి సంఘటన ఇదేమి మొదటి సారి కాదు. గతంలో కూడా కొంతమంది అభిమానులు తమ తమ అభిమాన హీరోల మీద ప్రేమను చాటుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా వాళ్ళ పెళ్లి శుభలేఖల్లో మోదీ, బాలయ్య ఫొటోలను ముద్రించి వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు.