ఇక ‘ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా తెలియచేస్తునారు. ఉధృతం చేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు అసలు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తు పని చేస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చెప్పిన అసలు సహించేది లేదు అని పార్టీ వర్గాలు తెలుపుతున్నారు.
గూండాగిరీ నడవదు. ఇప్పటివరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై ఇంకా బాగా కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు కచ్చితంగా తీసుకుంటుంది’ అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులపై
ప్రగతి భవన్లో సమీక్షించాన కూడా జరిపారు.
అన్ని ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు బాగా పెంచాలని, అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని, నిఘా పోలీసులను ఉపయోగించాలని తెలియచేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులకు ఆటంకం కలిగించేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం సృష్టిస్తే వారి అందరిని అవసరం లేదని సమావేశం నుంచే డీజీపీ మహేందర్రెడ్డికి ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు.
‘యూనియన్ నేతల పిచ్చి మాటలు నమ్మి ఆర్టీసీ కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. అంతే తప్ప ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదు అని అంటున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి దించారు. యూనియన్ నేతలు అత్యంత బాధ్యతాగ లేకుండా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా కారణం అయ్యారు అని సీఎం తెలియచేసారు.