హరియాణాలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ అగ్రనాయకులంతా హరియాణాకు బయలు దేరుతున్నారు. దీంతో హోరాహోరీ నెలకొంది హరియాణాలో. హరియాణా రాష్ట్రంలో 2009 వరకు కాంగ్రెస్‌ హవా కొనసాగినా 2014 తొలిసారి బీజేపీ పాగా వేసింది. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా పదికి పది స్థానాల్లోనూ విజయం సాధించి కమలం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే అనే  ధీమాతో ఉంది.

ఇక మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గ కుమ్ములాటలు కూడా బీజేపీకి మరింత బలం లభిస్తుంది. అయితే కుమారి సెల్జా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కూడా ఎలాగైనా పగ్గాలు చేజిక్కించుకోవాలని కసరత్తు బాగా చేస్తోంది. ప్రధాన పోటీ మాత్రం  బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుంది అని తెలుస్తుంది.


హరియాణాలో 18 ఏళ్ళ తరువాత జాట్‌యేతరుడైన ఖట్టర్‌ సీఎం అయ్యారు అని అందరికి తెలిసిందే. అయినా జాట్‌ల ఉద్యమాన్ని సరిగ్గా డీల్‌ చేయలేకపోయారన్న అని విమర్శలు  చాల ఉన్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ బాగా కృషి చేస్తోంది. ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న వేళ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు కనిస్పిస్తున్నాయి. మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి రావడం జరుగుతుంది. 


ఇక కాంగ్రెస్‌లో మాత్రం  లుకలుకలు కనిపిస్తున్నాయి. హరియాణా రాష్ట్రంలో పునర్‌వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతేలేదు అనే విదంగా ఉంది. స్వయంగా రాహుల్‌ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్‌ తన్వర్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టు ప్రవాసరిస్తున్నాయి. అంతేకాదు ఏకంగా ఢిల్లీలో సోనియా గాంధీ నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీ పార్టీలోకి  చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్‌ ప్రచారం ప్రారంభంనికి సిద్ధం ఐనా కూడా  కాంగ్రెస్‌ని నిరాశాభావం మాత్రం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: